గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన హైదరాబాద్లోని ఎంఐఎం కార్పొరేటర్లు నా బామ్మర్దులే అని అన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం దోస్తీతో ప్రజలకు ఇబ్బందులొస్తాయన్నారు. భూపాలపల్లి మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. టీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధి శూన్యమని, ప్రతి ఇంటికీ మంచినీళ్లు ఇవ్వలేకుంటే, ఓట్లు అడగబోనని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు ఎందుకు ఓట్లు అడుగుతున్నారని రాజాసింగ్ ప్రశ్నించారు.