Golconda Bonalu: గోల్కొండ జగదాంబిక అమ్మకు బోనాలు

* ఆషాఢ మాసం మూడో బోనం సమర్పిస్తున్న భక్తులు * తొట్టెల ఊరేగింపుతో కోటకు వస్తున్న భక్తులు

Update: 2021-07-18 08:01 GMT

గోల్కొండ బోనాలు (ఫైల్ ఫోటో)

Golconda Bonalu: చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఈ రోజు ఆషాఢ మాసం మూడో బోనం సమర్పిస్తున్నారు భక్తులు. పలు ప్రాంతాల నుంచి తొట్టెలను ఊరేగింపు కోటకు తీసుకువస్తున్నారు. కోటలో మూడో బోనం సమర్పించేందుకు వచ్చే భక్తులకు ప్రభుత్వం తరఫున సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆలయ ట్రస్టు చైర్మన్‌ కోయల్‌కార్‌ గోవింద్‌రాజ్‌ తెలిపారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News