భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 48 గంటల పాటు రాకపోకలు నిలిపివేత

*భద్రాచలం దగ్గర కొనసాగుతున్న మూడో ప్రమాద హెచ్చరిక

Update: 2022-07-14 09:23 GMT

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. 48 గంటల పాటు రాకపోకలు నిలిపివేత

Bhadrachalam: భద్రాచలం వద్ద గోదావరి తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటికే భద్రచలానికి మూడు వైపులా సంబంధాలు తెలిపోయాయి. మరోవైపు.. భద్రాచలం బ్రిడ్జిపై 48 గంటలు రాకపోకలు నిలిపివేశారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో అధికారులు ఇప్పటికే సహాయ చర్యలు ప్రారంభించారు. ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముందు జాగ్రత్తగా గజ ఈతగాళ్లతో పాటు నాటు పడవలు, ఎన్డీఆర్ఎఫ్‌ టీంలను సిద్ధంగా ఉంచారు. మరోవైపు భద్రాచలంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. సుభాష్‌నగర్‌లో ఎటు చూసినా నీళ్లే కనిపిస్తున్నాయి.

Tags:    

Similar News