కాంగ్రెస్ కంచుకోట హుజూర్ నగర్ను కారు పార్టీ బద్దలు కొట్టింది. టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన శానంపూడి సైదిరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ ఘన విజయంపై ఆ పార్టీ నేత కవిత స్పందించారు. 'కేసీఆర్పై అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, టీఆర్ఎస్కు అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు'అంటూ కవిత ట్వీట్ చేశారు.
కెసిఆర్ గారి పైన అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, తెరాస పార్టీ కి అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు 🙏🙏 ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన తెరాస కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు !! Jai Telangana !! Jai TRS !! Jai KCR !! #TRSForTelangana pic.twitter.com/1giKcYXeic
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 24, 2019