బీఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసులో అగ్ని ప్రమాదం.. నిలిచిన ఇంటర్నెట్‌ సేవలు

Update: 2019-06-22 03:54 GMT

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ బ్రాడ్ బ్యాండ్ సేవలు నిలిచిపోయాయి. బీఎస్‌ఎన్‌ఎల్ ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో టూ జీ, త్రీజీ పరికరాలన్నీ పూర్తిగా కాలిపోయాయి. దీంతో బ్యాంకులు, రైల్వే, ఆర్టీసీ, పోలీస్టేషన్లు, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. దినికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News