నల్గొండ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యేలు బాహాబాహీకి దిగారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కంచర్ల గోపాల్రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కంచర్ల భూపాల్రెడ్డి మాట్లాడుతుండగా నిధులు విడుదల చేయకుండా అభివృద్ధి ఎలా సాధ్యమని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి ప్రశ్నించారు.
దీంతో కోట్ల రూపాయల నిధులు విడుదలవుతుంటే ఎమ్మెల్యేగా కళ్లు కన్పించడం లేదా అంటూ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకానొక టైమ్లో కొట్టుకునే వరకు వెళ్లడంతో పోలీసులు కలగజేసుకొని గొడవ సద్దుమణిగేలా చేశారు.