Nizamabad: నిజామాబాద్‌లో లక్కీ డ్రా పేరుతో ఘరనా మోసం

Nizamabad: నిజామాబాద్‌లో లక్కీ డ్రాల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది.

Update: 2021-07-06 14:51 GMT

Nizamabad: నిజామాబాద్‌లో లక్కీ డ్రా పేరుతో ఘరనా మోసం

Nizamabad: నిజామాబాద్‌లో లక్కీ డ్రాల ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. నెలకు వెయ్యి రూపాయల చొప్పునా, 20నెలలకు 50వేల బహుమతులు ఇస్తామని ఆశపెట్టిన ఓ కంపెనీ నిర్వాహకులు బోర్డు తిప్పేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

జిల్లా కేంద్రంగా సుమారు ఐదు కంపెనీలు డ్రా నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే ఓ కంపెనీ బోర్డు తిప్పేయగా మరో రెండు అవే దారిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అనుమతి లేకుండా లక్కీ డ్రా నిర్వహించే కంపెనీలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags:    

Similar News