బాన్స్ వాడ లో నకిలీ ఇళ్ల పట్టాల కలకలం

కామారెడ్డి జిల్లా బాన్స్ వాడలో డబుల్ బెడ్ రూమ్ నకిలీ పట్టాలు కలకలం సృష్టిస్తున్నాయి.

Update: 2020-02-28 13:14 GMT

కామారెడ్డి జిల్లా బాన్స్ వాడలో డబుల్ బెడ్ రూమ్ నకిలీ పట్టాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఒకటి రెండు కాదు ఏకంగా 40 నకిలీ ఇళ్ల పట్టాలతో మోసగాళ్లు లక్షలాది రూపాయలు దండుకున్నారు. డూప్లికేట్ పట్టాల వ్యవహారం అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి వెళ్లింది.

స్థానిక ప్రింటింగ్ ప్రెస్ లో కొందరు నేతలు నకిలీ ఇళ్ల పట్టాలను ప్రింట్ చేయించారని తెలుసుకుని ఆయన షాక్ తిన్నారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించిన స్పీకర్.. మోసగాళ్లపై క్రిమినల్ కేసులు నమోదుచేయాలని పోలీసులను ఆదేశించారు. కొందరు తాను ఇచ్చిన అసలు పట్టాల స్థానంలో నకిలీ పట్టాలు ముద్రించి ప్రజలకు మోసం చేశారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Full View

Tags:    

Similar News