మాజీ ఎంపీ, సీనియర్ నేత గడ్డం వివేక్ కాసేపట్లో బీజేపీలో చేరనున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్తో కలిసి ఢిల్లీ చేరుకున్న ఆయన బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ను వీడిన అనంతరం గతంలో ఓ సారి అమిత్షాను కలిసి చర్చించారు. వివేక్ను కాంగ్రెస్లోకి తీసుకొచ్చేందుకు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారు . స్వయంగా చర్చలు కూడా జరిపారు. వివిధ సమీకరణల నేపధ్యంలో బీజేపీలో చేరాలని వివేక్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.