RS Praveen Kumar: కేసీఆర్ ప్రభుత్వంపై మండిపడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

* మెదక్ జిల్లాలోని గురుకుల పాఠశాలలో మృతి చెందిన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్

Update: 2021-10-07 12:08 GMT

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (ఫైల్ ఫోటో) 

RS Praveen Kumar: రాష్ట్ర వైద్య శాఖ సీఎం కేసీఆర్ ఆధీనంలో ఉన్నప్పటికీ నిరుపేదలకు వైద్యం అందడం లేదని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్‌లో పర్యటించిన ఆయన అనారోగ్యంతో గురుకుల పాఠశాలలో మృతి చెందిన బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాబోయే రోజుల్లో ఏనుగు గుర్తుకు ఓటు వేసి బీఎస్పీని గెలిపిస్తే ప్రజలందరికీ ఉచిత వైద్యం, విద్య అందించే ప్రణాళికలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News