Errabelli Dayakar: కిషన్‌రెడ్డి జన ఆశీర్వాద యాత్ర ఫెయిల్యూర్‌ యాత్ర

* కేంద్రమంత్రిగా కిషన్‌రెడ్డి తెలంగాణకు ఏం చేశారు..? * ఏడేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదు

Update: 2021-08-21 08:30 GMT

ఎర్రబెల్లి దయాకర్‌రావు (ఫోటో: ది హన్స్ ఇండియా)

Errabelli Dayakar Rao: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర ఫెయిల్యూర్‌ యాత్ర అని విమర్శించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఏడేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీలేదని ఆరోపించారు. విభజన చట్టంలోని హామీలను కాలరాసి ఇప్పుడు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్‌ అయ్యారు. తెలంగాణలో మెడికల్‌ కాలేజీ కావాలని కోరితే దేశం మొత్తం ఇచ్చారని, పక్కనే ఉన్న ఏపీకి 7 కాలేజీలు కేటాయించారని, కానీ తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణ నుంచి బీజేపీ ఎంపీలుగా గెలిచి, ఏం సాధించారో చెప్పాలని ఛాలెంజ్‌ విసిరారు ఎర్రబెల్లి.

Tags:    

Similar News