Singareni: ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు
Singareni: గత ఎన్నికల ప్రచారంలో రాహుల్తో సింగరేణి కార్మికుల భేటీ
Singareni: ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరగనున్నాయి. సత్తా చాటేందుకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీల వ్యూహాలు రచిస్తున్నాయి. తమ పార్టీ కార్మిక శాఖ గెలవడం కోసం కసరత్తు మొదలు పెట్టారు. మరోసారి పట్టు నిలుపుకుందుకు బిఆర్ఎస్ ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కోల్బెల్ట్ ప్రాంతం కాంగ్రెస్ పార్టీకి జై కొట్టింది. మరోవైపు AITUC ప్రచారంలో దూసుకుపోతోంది. టాక్స్ రిలీఫ్ ,కారుణ్య నియామకాలు, మెడికల్ ఫిట్నెస్ హామీలపై కార్మిక సంఘాలు ఫోకస్ పెట్టాయి. సింగరేణి ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రచారం నిర్వహించే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో ప్రచారంలో రాహుల్ గాంధీ సింగరేణి కార్మికుల భేటీ అయ్యారు. 2017లో చివరిసారిగా గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. రెండేళ్లకోసారి ఎన్నికలు జరగాల్సి ఉండగా వివిధ కారణాలతో యాజమాన్యం వాయిదా వేస్తూ వచ్చింది.