KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు ఎలక్షన్ కమీషన్‌ నోటీసులు

KCR: ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ నోటీసులు

Update: 2024-04-17 04:30 GMT

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు ఎలక్షన్ కమీషన్‌ నోటీసులు

KCR: మాజీ సీఎం కేసీఆర్‌కు ఎలక్షన్‌ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనకు మంగళవారం నోటీసులు ఇచ్చింది. ఈనెల 5న సిరిసిల్లలో కేసీఆర్ పర్యటించారు. అదే సమయంలో మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి మీద అవమాకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ.. పీసీసీ ఉపాధ్యాక్షుడు నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ఈసీ... కేసీఆర్‌‌కు నోటీసులు జారీ చేసింది. దీనిపై రేపు ఉదయం 11 గంటలలోగా సమాధానం ఇవ్వాలని ఈసీ కోరింది.

Tags:    

Similar News