హైదరాబాద్‌లో మరో ఎనిమిది కంటైన్మెంట్‌ జోన్లు

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న కంటైన్మెంట్‌ జోన్లు కాకుండా మరో ఎనిమిది కంటైన్మెంట్‌ జోన్లను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.

Update: 2020-05-03 13:58 GMT

హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం ఉన్న కంటైన్మెంట్‌ జోన్లు కాకుండా మరో ఎనిమిది కంటైన్మెంట్‌ జోన్లను వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు.వనస్థలిపురం పరిధిలో ఇప్పటి వరకు 9 కేసుల నమోదు కావడంతో 8 కాలనీల్లో కంటైన్మెంట్‌ జోన్లుగా అధికారులు గుర్తించారు. ఫేజ్‌ 1 కాలనీ, సచివాలయం నగర్‌, ఎస్‌కేడీ నగర్‌, హుడాసాయినగర్‌, కమలానగర్‌, రైతుబజార్‌ సమీపంలో ఎ.బీటైప్‌ కాలనీ, రైతుబజార్‌ సాహెబ్‌నగర్‌లను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు.

ఆయా కాలనీలలో 169 కుటుంబాలు హోంక్వారంటైన్‌లో ఉన్నాయి. కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలోని నివాసపరిసరాల్లో కఠిన ఆంక్షలు విధించారు. రేపటి నుంచి ఆ జోన్లలో రాకపోకలు వారం రోజుల పాటు నిషేదించారు.

Tags:    

Similar News