సీఎం కేసీఆర్‎పై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

Update: 2020-12-16 14:03 GMT

సీఎం కేసీఆర్ కు రైతుల పట్ల చిత్త శుద్దే ఉండి ఉంటే ఢిల్లీ పర్యటనలో రైతులను కలిసేవారన్నారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు. కేసీఆర్ ఎవరి ప్రయోజనాల కోసం ఢిల్లీలో పర్యటించారో టీఆర్ఎస్ నేతలే చెప్పాలన్నారు. రైతుల ప్రయోజనాల కోసమే నూతన చట్టాలను తెచ్చామన్న రఘునందన్ రావు.. రైతును రాజు చేసే వ్యవసాయ చట్టాలతో వారికి ఇబ్బందులు ఉంటే సవరిస్తామన్నారు. ఉద్యమంలో అంబానీ, ఆదానీ పేర్లను వాడి రైతులను కన్ఫ్యూజన్ కు గురి చేయవద్దంటూ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News