దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్‌: 12వ రౌండ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం

Update: 2020-11-10 08:16 GMT

దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు గంట గంటకూ ఉత్కంఠ రేపుతోంది. దుబ్బాక ఎన్నిక ఫలితాల్లో తొలిసారిగా కాంగ్రెస్‌ ఆధిక్యం కనబరిచింది. పన్నెండో రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి 83 ఓట్ల ఆధిక్యంలో నిలిచారు. దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్‌ 12వ రౌండ్‌లో బీజేపీ 1,997 ఓట్లు, టీఆర్ఎస్ 1,900 ఓట్లు సాధించింది. అనూహ్యంగా కాంగ్రెస్‌ అభ్యర్థికి 2,080 ఓట్లు పడ్డాయి. 12 రౌండ్ల కౌంటింగ్‌ పూర్తయ్యేసరికి బీజేపీ 4,030 ఓట్ల ఆధిక్యంలో ఉంది. మొత్తం 23 రౌండ్లు ఉండగా.. ఇప్పటి వరకు 12 రౌండ్లు పూర్తయ్యాయి.

Tags:    

Similar News