డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిది ప్రభుత్వ హత్య- పొన్నాల లక్ష్మయ్య
♦ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు కేసీఆర్ బాధ్యత వహించాలి ♦ పండుగ పూట ఆర్టీసీ కార్మికులు పస్తులున్నారు
డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డిది ప్రభుత్వ హత్య అని, ఆయన ఆత్మహత్యకు కేసీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఐదుగురు కార్మికులు గుండెపోటుతో మరణించారని. ఈ చావులకు కేసీఆర్ దే బాధ్యతన్నారు. పండుగ పూట ఆర్టీసీ కార్మికులు పస్తులున్నారని. అయితే కేసీఆర్ మాత్రం కుటుంబంతో వాహనాలకు పూజలు చేస్తూ సంతోషంగా గడిపారని ఆయన అన్నారు.