దిశ నిందితుల మృతదేహాల అప్పగింతపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. గాంధీ ఆసుపత్రిలో మృతదేహాలను భద్ర పరిచారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో మృతదేహాల అప్పగింత మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు మృతదేహాల కోసం ఎదురుచూసిన బాధిత కుటుంబాలు ఇప్పుడు, మృతదేహాలు తమకు వద్దంటున్నారు. న్యాయం జరిగే వరకు మృతదేహాలు తీసుకోమని తేల్చి చెబుతున్నారు. మృతదేహాలు ఖననం చేయకుండా న్యాయం కోసం పోరాటం చేస్తామంటున్నారు.