Rajnath Singh: సమిష్టి తత్వం ద్వారా లాజిస్టిక్స్ రంగం బలపడుతుంది

Rajnath Singh: సమిష్టి తత్వం ద్వారా లాజిస్టిక్స్ రంగం బలపడుతుంది

Update: 2022-09-12 10:23 GMT

Rajnath Singh: సమిష్టి తత్వం ద్వారా లాజిస్టిక్స్ రంగం బలపడుతుంది

Rajnath Singh: సాయుధ బలగాలకు చెందిన త్రివిధ దళాలు ఉమ్మడి నిర్వహణ దిశగా భారత్‌లో వేగంగా అడుగులు పడుతున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తెలిపారు. ఒక సర్వీసుకు చెందిన వనరులు ఇతర సర్వీసులకు సులభంగా అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. ఆర్మీ లాజిస్టిక్స్‌పై జరిగిన సెమినార్‌లో మంత్రి ప్రసంగిస్తూ..గత 7ఏళ్లలో రైల్వే రంగంలో ఎంతో వేగంగా పురోగతి సాధించామన్నారు. 9వేల కిలోమీటర్ల రైల్వే లైన్లలను రెట్టింపు చేశామన్నారు. పౌర, సైనిక వర్గాల మధ్య కలయిక, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలని పిలుపునిచ్చారు. సమిష్టి తత్వం ద్వారా లాజిస్టిక్స్ రంగం బలపడుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తెలిపారు. 

Tags:    

Similar News