మూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతి

Nalgonda: మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల

Update: 2022-06-27 05:31 GMT

మూసీ ప్రాజెక్టుకు పెరుగుతున్న వరద ఉధృతి

Nalgonda: నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలతో గత కొద్ది రోజులుగా మూసీ ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో మూసీ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఇవాళ అధికారులు.. ప్రాజెక్టు మూడు క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు 2వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మూసీ ప్రాజెక్టు సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ ఫ్లో 12వందల 47.79 కాగా.. ఔట్ ఫ్లో 19వందల 92.74 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

Tags:    

Similar News