హైకోర్టు ఆదేశాలతో కదిలిన తెలంగాణ సర్కార్

Update: 2019-10-25 10:58 GMT

తెలంగాణలో డెంగ్యూ మరణాలపై హైకోర్టు తీవ్రంగా స్పందించిన నేపధ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. డెంగ్యూపై వివిధ శాఖల అధికారులతో సీఎస్ జోషి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో డెంగ్యూతో బాధపడుతున్న వారి వివరాలను తెలుసుకున్నారు. డెంగ్యూ అధికంగా ప్రబలుతున్న ప్రాంతాల్లో ప్రత్యేకంగా అమలు చేయాల్సిన కార్యచరణపై చర్చించారు. దోమల నివారణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మురికి నీరు నిల్వ ఉండకుండా చూడాలంటూ ఆదేశించారు. ఇదే సమయంలో డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, వ్యాధులపై చర్చించేందుకు ప్రత్యేక టీం పంపినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.      

Tags:    

Similar News