ములుగు జిల్లాలో కాల్పుల కలకలం.. ఘటనలో సీఆర్పీఎఫ్‌ జవాన్ మృతి

Mulugu: వెంకటాపురంలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్ల మధ్య కాల్పులు...

Update: 2021-12-26 05:46 GMT

ములుగు జిల్లాలో కాల్పుల కలకలం.. ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి

Mulugu: ములుగు జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. వెంకటాపురం పోలీస్‌ స్టేషన్‌లో 39 బెటాలియన్‌కు చెందిన ఇద్దరు సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్ల మధ్య వివాదం తలెత్తింది. దీంతో ఆగ్రహానికి గురైన హెడ్‌ కానిస్టేబుల్‌ స్టీఫెన్‌.. సీఆర్పీఎఫ్‌కు చెందిన ఎస్సై ఉమేష్‌చంద్రపై కాల్పులు జరిపాడు. అనంతరం తనకు తాను కాల్చుకున్నాడు. ఈ ఘటనలో ఉమేష్‌ మృతిచెందగా.. స్టీఫెన్‌ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News