Yergatla: పెండ్లి రోజు సందర్భంగా నీరు పేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన దంపతులు

Update: 2020-04-26 13:02 GMT

ఏర్గట్ల మండల కేంద్రంలో ఎంపీటీసీ డాక్టర్ సంధ్య మధు దంపతులు వారి వివాహా వార్షికోత్సవం సందర్భంగా, కరోనా లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన వలస కూలీలకు, గ్రామంలోని 20 నిరుపేద కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువులును పంపిణీ చేశారు.

ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలవాలని మంత్రి వర్యులు వేముల ప్రశాంత్ ఇచ్చిన పిలుపు మేరకు, గ్రామంలోని పేద కుటుంబాలకు వలస కూలీలకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర వస్తువుల ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జక్కనీ మధు కుటుంబ సభ్యులు, కండ్లి వెంకటేష్, కుశ రాకేశ్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News