Coronavirus Updates in Telangana: తెలంగాణలో కొత్తగా 2,273 పాజిటివ్ కేసులు...

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది.

Update: 2020-09-16 03:20 GMT

Coronavirus Updates in Telangana | తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకు 55,636 నమూనాలు పరిశీలించగా కొత్తగా 2,273 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 996కి చేరింది. నిన్న ఒక్క రోజే 2,260 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,62,844కి చేరింది. ఇప్పటి వరకూ డిశ్చార్జి అయిన సంఖ్య 1,31,447కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,401 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.61శాతంగా ఉండగా, రికవరీ రేటు 80.71శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. 23,569 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నట్లు చెప్పింది. మొత్తం 22,76,222 టెస్టులు చేసినట్లు తెలిపింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో 325, రంగారెడ్డిలో 185, కరీంనగర్‌లో 122, నల్గొండ 175, మేడ్చల్ మల్కాజ్ గిరి 164 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి.




Tags:    

Similar News