Kodandaram: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ మా మద్ధతు కోరింది

Kodandaram: మద్ధతు అంశంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం

Update: 2022-08-18 03:06 GMT

మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ మా మద్ధతు కోరింది

Kodandaram: మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తమ మద్ధతు కోరిందన్నారు తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్. ఆఫీస్ బేరర్ల సమావేశంలో చర్చించి.. మద్ధతు అంశంపై రాష్ట్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. మునుగోడులో తమ క్యాడర్ ఉందని.. పోటీపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలంగాణ జనసమితిని ఏ పార్టీలోనూ విలీనం చేయమని స్పష్టం చేశారు. పార్టీ విలీనంపై వస్తున్న వార్తలపై... క్యాడర్ ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఇక మునుగోడు ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచే డబ్బు ప్రభావం నడుస్తోందని.. ప్రజా ప్రతినిధులను ఇష్టారీతిన కొనేస్తున్నారంటున్న తెలంగాణ జనసమితి అధ్యక్షులు కోదండరామ్‌.

Tags:    

Similar News