తెలంగాణ కాంగ్రెస్లో క్యాస్ట్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. పీసీసీ నాయకత్వాన్ని ఎప్పుడూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికే ఎందుకివ్వాలని ఆ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు ప్రశ్నించారు. పార్టీ నాయకత్వంలో ముగ్గురు రెడ్లు ఉండి ఏం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సారి పీసీసీ పదవి బీసీలకే ఇవ్వాలని వీహెచ్ డిమాండ్ చేశారు. తనకంటే సీనియర్, లాయలిస్ట్ ఎవరంటూ చెప్పుకొచ్చారు. పారాచూట్లకు పదవులు ఇవ్వొద్దని రాహుల్గాంధీ చెబుతున్నా అలాంటి వారికే కట్టబెడుతున్నారని వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.