ఆ బిడ్డ తమదంటే.. తమ దంటున్నారు ఇద్దరు తల్లులు. పేగు తెంచుకుని పుట్టిందని ఓ తల్లి, దత్తత తీసుకున్నానని మరో తల్లి చెబుతున్నారు. ఇప్పుడు ఆ బిడ్డ కోసం ఇద్దరు తల్లుల మధ్య వివాదం మొదలైంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేటకు చెందిన కోటపాటి సోని, దినకర్లకు సీకేఎం ఆస్పత్రిలో రికార్డులున్నాయని చెబుతోంది సోని తల్లి సుశీల. ఎంజీఎంలో సోని పక్క బెడ్లో ఉన్న అలీషా బేగం అనే మరో తల్లి వీరి వద్ద నుంచి దత్తత తీసుకున్నట్టు చెబుతోంది. ఎంజీఎంలో రికార్డులు చూస్తే పసిపాప తల్లిదండ్రులుగా అలిషాబేగం దంపతులు పేర్లు నమోదయ్యాయి. దీంతో ఈ ఇద్దరు తల్లుల వివాదం తీవ్రమైంది.