అఖిలప్రియకు బెయిల్ మంజూరు

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది.

Update: 2021-01-22 14:07 GMT

భూమా అఖిల ప్రియ (ఫైల్ ఫోటో)

బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. శుక్రవారం నాడు అఖిలప్రియకు సెషన్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రూ.10 వేల పూచీకత్తుతో ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో అరెస్టై రిమాండ్‌లో ఉన్న అఖిలప్రియ.. రేపు(శనివారం) జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

Tags:    

Similar News