Revanth Reddy: యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: తెలంగాణ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలి

Update: 2023-12-10 07:26 GMT

Revanth Reddy: యశోద ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్‌ను పరామర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి

Revanth Reddy: కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రవేంత్‌ వెంట మంత్రులు సీతక్క, జూపల్లితో పాటు షబ్బీర్ అలీ ఉన్నారు. హిప్ రీప్లేస్‌మెంట్ తర్వాత కేసీఆర్ కోలుకుంటున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కేసీఆర్ త్వరగా కోలుకుని అసెంబ్లీకి రావాలని... తెలంగాణ ప్రజల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు.

Tags:    

Similar News