CM KCR: 'శోభకృత్‌'లో అన్నిరంగాల్లో శుభాలు కలగాలి...

CM KCR: తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ శోభ మొదలైంది.

Update: 2023-03-22 06:15 GMT

CM KCR: ‘శోభకృత్‌’లో అన్నిరంగాల్లో శుభాలు కలగాలి...

CM KCR: తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగ శోభ మొదలైంది. శోభకృత్ నామ సంవత్సర ఉగాదిని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. శోభకృత్‌ నామ సంవత్సరంలో అన్ని రంగాల్లో శుభాలు కలగాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం కేసీఆర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. తాగు, సాగు నీరు, పచ్చని పంటలతో తెలంగాణలో నిత్య వసంతం నెలకొన్నదని పేర్కొన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందని స్పష్టంచేశారు. 'శోభకృత్‌' నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు.

Tags:    

Similar News