రేపు సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్న సీఎం కేసీఆర్

* ఈ నెల 14న ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం... ఈ నెల 13న ఢిల్లీకి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు

Update: 2022-12-11 06:15 GMT

రేపు సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్న సీఎం కేసీఆర్

CM KCR: రేపు సాయంత్రం ఢిల్లీకి బయల్దేరి వెళ్లనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఐదు రోజుల పాటు ఢిల్లీలోనే ఆయన మకాం వేయనున్నారు. ఈ నెల 14న ఢిల్లీలో బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ బాట పట్టనున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలు. ఈ నెల 13న వారంతా ఢిల్లీకి బయల్దేరనున్నారు. ఇక ఢిల్లీ వేదికగా వివిధ పార్టీల నేతలు, రైతు సంఘాల నాయకులతో పాటు మీడియా ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ భేటీ కానున్నారు. దేశంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంపై కేసీఆర్‌ దృష్టి పెట్టనున్నారు.

Full View
Tags:    

Similar News