KCR: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
KCR: ఈ నెల 4న బీఆర్ఎస్ ఆఫీస్ను ప్రారంభించనున్న కేసీఆర్
KCR: ఇవాళ సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. దాదాపు మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలో ఉండనన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4న బీఆర్ఎస్ సెంట్రల్ ఆఫీస్ను గులాబీ దళపతి ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం పనులు పూర్తయ్యాయి. మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ఢిల్లీ వసంత విహార్లో నిర్మాణమైన సెంట్రల్ ఆఫీస్ ప్రారంభ పనులను పరిశీలిస్తున్నారు. హస్తిన యాత్ర సందర్భంగా పలువురు జాతీయ నేతలతో సీఎం కేసీఆర్ భేటీ కానున్నారు.