CM KCR: మునుగోడుకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించే అవకాశం

CM KCR: ఈనెల 30, 31 లేదా వచ్చేనెల 1న సభకు అవకాశం.. బహిరంగ సభకు హాజరుకానున్న ముఖ్యమంత్రి కేసీఆర్

Update: 2022-10-25 04:13 GMT

CM KCR: మునుగోడుకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించే అవకాశం

CM KCR: మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి భారీ బహిరంగ సభతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫినిషింగ్ టచ్ ఇవ్వనున్నారు. చండూర్ మండల కేంద్రంగా ఈనెల 30న లేదా 31 తేదీలు.. ఈ రెండూ కాదంటే వచ్చేనెల 1న TRS భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. మునుగోడు ప్రజలకు భరోసా కల్పించనున్నారు. లక్షమందితో చండూరు సభ నిర్వహించాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. ఈ సభ కోసం ఇతర ప్రజలను తరలించకుండా.. కేవలం మునుగోడు ప్రాంత వాసులనే తీసుకొచ్చేలా ప్రణాళికలు రచిస్తున్నారు. చండూరు వేదికగా బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టడమే కాకుండా మునుగోడు ప్రజలకు ముఖ్యమంత్రి వరాలు ప్రకటించే అవకాశం ఉంది.

Full View
Tags:    

Similar News