CM KCR: హుజూరాబాద్‌లో ఈనెల 16న సీఎం కేసీఆర్‌ పర్యటన

CM KCR:జనసమీకరణకు 150 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు బాధ్యతలు * కరీంనగర్‌ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు

Update: 2021-08-14 06:50 GMT

ఈ నెల 16 న హెజురాబాద్ లో సీఎం కేసీఆర్ పర్యటన (ఫైల్ ఇమేజ్)

CM KCR: హుజూరాబాద్‌ ఉపఎన్నికలో గెలుపే లక్ష్యంగా అధికార పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న టీఆర్ఎస్‌.. దళితబంధు పథకాన్ని విజయానికి అస్త్రంగా వాడుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే వాసాలమర్రిలో పలు దళిత కుటుంబాలకు ఈ పథకం అందింది. ఇక.. ఈ నెల 16న హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. ఇప్పటికే.. సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక భారీ జనసమీకరణ కోసం 150 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు బాధ్యతలు అప్పగిస్తూ.. కరీంనగర్‌ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. 

Tags:    

Similar News