యూరియా కోసం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనలకు దిగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్లో ఉన్నతాధికారులతో సమావేశమైన కేసీఆర్..... యూరియా కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైనంత యూరియా అందుబాటులో ఉంచాలని, అలాగే, మూడ్రోజుల్లో రైతులందరికీ యూరియా సరఫరా చేయాలని సూచించారు.