తెలంగాణ గవర్నర్ తమిళసైతో రాజ్భవన్లో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈనెల ఆరు నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించారు. కరోనా నియంత్ర చర్యలను గవర్నర్ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకు వెళ్లారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగించిన తర్వాత బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశమవుతుంది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే విషయాన్ని బీఏసీ సమావేశంలో ఖరారుచేస్తారు.