CM KCR: ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా సీఎం కేసీఆర్

CM KCR: కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌తో భేటీ * ధాన్యం కొనుగోళ్లపై మంత్రితో కీలక చర్చ

Update: 2021-09-27 09:33 GMT
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిసిన సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం కేంద్ర ఆహార సరఫరాల మంత్రి పియూష్ గోయల్‌తో కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కీలక చర్చ నిర్వహించారు. ఈ భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఎంపీలు సురేష్ రెడ్డి, నామా నాగేశ్వరరావు, బీబీ పాటిల్, వెంకటేష్ నేత, కొత్త ప్రభాకర్ రెడ్డి, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ పాల్గొన్నారు.

Tags:    

Similar News