CJI NV Ramana: యాదాద్రి ల‌క్ష్మీన‌రసింహ‌స్వామిని ద‌ర్శించుకున్న సీజేఐ దంప‌తులు

CJI NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ సతీసమేతంగా యాదాద్రి ల‌క్ష్మీన‌రసింహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు.

Update: 2021-06-15 04:04 GMT

CJI NV Ramana: యాదాద్రి ల‌క్ష్మీన‌రసింహ‌స్వామిని ద‌ర్శించుకున్న సీజేఐ దంప‌తులు

CJI NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా యాదాద్రి ల‌క్ష్మీన‌రసింహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. హైద‌రాబాద్ నుంచి ఈ ఉద‌యం బ‌య‌లుదేరి యాదాద్రి వెళ్లిన సీజేఐకు మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్‌రెడ్డి, జ‌గ‌దీశ్‌రెడ్డి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. కొండపై నూతనంగా నిర్మించిన వీవీఐపీ అతిథి గృహం వద్ద దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యుత్‌శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఆలయ అధికారులు ఎన్వీ రమణ దంపతులకు ఘన స్వాగతం పలికారు. 9.45 గంటల నుండి 10 గంటల వరకు వివిఐపి గెస్ట్ హౌస్‌లో అల్పాహారం తీసుకోనున్నారు. ఆపై 10 గంటలకు యాదాద్రి ఆలయం నుంచి సీజేఐ తిరుగు పయనమవనున్నారు.

Tags:    

Similar News