గవర్నర్‌ తమిళ సై ని చిరంజీవి ఎందుకు కలిశారు?

Update: 2019-10-05 12:18 GMT

మెగాస్టార్‌ చిరంజీవి తెలంగాణ గవర్నర్‌ తమిళిసైని కలిశారు. పుష్పగుచ్ఛం, శాలువాతో ఆమెను సత్కరించారు. గవర్నర్‌కు ఆయన దసరా శుభాకాంక్షలు తెలిపారు. బ్రిటీషర్లపై పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన సైరా సినిమాను వీక్షించాలని గవర్నర్‌ను కోరారు. త్వరలోనే సినిమా చూస్తానని ఆమె చెప్పారు. కాగా, ఈనెల 2న విడుదలైన 'సైరా నరసింహారెడ్డి' సినిమా బాక్సాఫీస్‌ వద్ద సందడి చేస్తోంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో మూడు రోజుల్లోనే వంద కోట్ల కలెక్షన్లు సాధించినట్టు సమాచారం.



 


Tags:    

Similar News