నిజామాబాద్లో పిల్లల మిస్సింగ్ కలకలం రేపుతుంది. నాగారం ప్రాంతానికి చెందిన ముగ్గురు పిల్లలు అదృశ్యం కావడం చర్చనీయాంశంగా మారింది. స్కూల్కి వెళ్లి తిరిగి రాకపోవడంతో కంగారు పడ్డ తల్లిదండ్రులు ఆచూకీ కోసం బంధువుల ఇళ్లు, ఇతర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు కంప్లీట్ చేశారు.మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు... విద్యార్ధుల కోసం గాలిస్తున్నారు. కనిపించకుండా పోయిన వారిలో ఒకరు మూడో తరగతి, ఇద్దరు నాలుగో తరగతి చదువుతున్నట్లు తెలిపారు. బిడ్డలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.