మంత్రి సబిత, ధర్మానకు సీబీఐ సమన్లు

Update: 2020-01-10 11:29 GMT

పెన్నా సిమెంట్స్‌ కేసులో అనుబంధ అభియోగపత్రం విచారణకు నాంపల్లి ప్రత్యేక సీబీఐ కోర్టు స్వీకరించింది. పెన్నా సిమెంట్‌ అనుబంధ చార్జిషీట్‌లో మంత్రి సబిత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు నిందితులకు సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది.

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీ, విశ్రాంతి అధికారులు శామ్యూల్, వీడి రాజగోపాల్‌లకు సీబీఐ కోర్టు సమన్లుజారీ చేసింది. డీఆర్వో సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మకు సైతం సమన్లు జారీ అయ్యాయి. పెన్నా సిమెంట్స్‌ కేసులో ఈ నెల 17న హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అనుబంధ చార్జిషీట్లను పరిగణించవద్దన్నారు జగన్. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి సీబీఐ కోర్టు వాయిదా వేసింది. 

Tags:    

Similar News