అమీర్పేట్ మెట్రో స్టేషన్ ఘటనపై మౌనిక భర్త ఫిర్యాదు మేరకు.. ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాణంలో నిర్లక్ష్యం వహించి.. ఓ మహిళ మృతికి కారణమైన ఎల్ అండ్ టీ యాజమాన్యంపై సెక్షన్ 304 ఏ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అమీర్పేట్ ఘటనపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రయాణీకుల భద్రతే ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.