కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. ఐదుగురు మృతి...

Kamareddy: *సిరిసిల్ల వైపు నుంచి కామారెడ్డి వెళ్తున్న కారు *ఆర్టీసీ బస్సు కరీంనగర్ డిపో-1కి చెందినదిగా గుర్తింపు

Update: 2022-03-28 06:34 GMT

కామారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు- కారు ఢీ.. ఐదుగురు మృతి...

Kamareddy: కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచారెడ్డి మండలం ఘన్‌పూర్‌లో ఆర్టీసీ బస్సు, కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సిరిసిల్ల వైపు నుంచి కామారెడ్డికి కారు వెళ్తున్న సమయంలో కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ఆర్టీసీ బస్సు కరీంనగర్ డిపో-1కి చెందినదిగా గుర్తించారు.

Tags:    

Similar News