Rangareddy: గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

Rangareddy: రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ వద్ద ఐదుగురు అరెస్ట్.. రూ.70 లక్షల విలువైన గంజాయి స్వాధీనం

Update: 2022-01-18 02:46 GMT

 గంజాయి సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

Rangareddy: గంజాయి సరఫరా చేస్తున్న ముఠాను శంషాబాద్ ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం తిమ్మాపూర్ వద్ద ఐదుగురు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 70 లక్షల రూపాయల విలువైన గంజాయి, మూడు కార్లు, మొబైల్ ఫోన్లు, 2.10 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Tags:    

Similar News