తెలంగాణా ముఖ్యమంత్రికి భారతరత్న ఇవ్వాలని అందుకోసం పాదయాత్రని నిర్వహించనున్నట్టు టీఆర్ఎస్వీ నాయకుడు బీటెక్ తేజ ఓ ప్రకటన విడుదల చేసారు . తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన చేసిన ఉద్యమం మరియు రాష్ట్రాన్ని సాధించి , రాష్ట్రాన్ని మొదటి స్థానంలో కేసీఆర్ నిలిపారని బీటెక్ తేజ వాఖ్యానించారు ... ఈ పాదయాత్ర సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మొదలై దాదాపుగా 3,500 కిలోమీటర్ల వరకు సాగి కశ్మీర్లో ముగుస్తుందని అయన చెప్పుకొచ్చారు . ఈ పాదయాత్రలో బీటెక్ తేజతో పాటు ధర్మతేజ,సీహెచ్ సాయికుమార్, పవన్, గణేశ్ కూడా పాల్గొంటారు . పాదయాత్ర ముగిసిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలుస్తామని బీటెక్ తేజ చెప్పుకొచ్చాడు ..