Hyderabad: హైదరాబాద్‌ అల్వాల్‌ పీఎస్‌ పరిధిలో దారుణం

Hyderabad: BHEL కాలనీ సమీపంలోని రైల్వేట్రాక్‌పై యువతి మృతదేహం *యువతి సరస్వతిని ఉరివేసి హత్యచేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Update: 2021-08-03 07:56 GMT

Representational Image

‌Hyderabad: హైదరాబాద్‌ అల్వాల్‌ పీఎస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. B.H.E.L కాలనీ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై యువతి మృతదేహం.. తీవ్ర కలకలం రేపుతోంది. యువతి సరస్వతిని ఉరి వేసి హత్యచేశారు గుర్తుతెలియని వ్యక్తులు. మృతురాలు బోయినపల్లి ఒమేగా కాలేజీలో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతోంది. నిన్న ఉదయం ఇంటి నుంచి వెళ్లిన సరస్వతి.. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో బంధువులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇవాళ మృతదేహాన్ని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags:    

Similar News