రాష్ట్రంలో వచ్చే అన్ని ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది : లక్ష్మణ్
టీఆర్ఎస్ ఆడ్డాగా ఉన్న దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురవేశామన్నారు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్. గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్- ఎంఐఎం పట్ల విసుగు చెందారన్నారు.
టీఆర్ఎస్ ఆడ్డాగా ఉన్న దుబ్బాకలో బీజేపీ జెండా ఎగురవేశామన్నారు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు లక్ష్మణ్. గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్- ఎంఐఎం పట్ల విసుగు చెందారన్నారు. గతంలో ఇచ్చిన హామీలను టీఆర్ఎస్ విస్మరించిందని లక్ష్మణ్ ఆరోపించారు. బీజేపీ చేతిలో పరాజయాన్ని జీర్ణించుకోలేక వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్రంలో వచ్చే అన్ని ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు లక్ష్మణ్. అటు ఈ నెల 8న రైతులు తలపెట్టిన భారత్ బంద్కు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్ధతు ఇస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.