మేయర్‌ ఎన్నికలకు బీజేపీ రెడీ

* కాసేపట్లో బషీర్‌బాగ్‌ అమ్మవారి ఆలయంలో కార్పొరేటర్ల ప్రత్యేక పూజలు * అనంతరం జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి బీజేపీ కార్పొరేటర్లు * బీజేపీకి మొత్తం 47 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎక్స్‌అఫీషియో సభ్యులు

Update: 2021-02-11 03:15 GMT

Representational Image

మేయర్‌ ఎన్నికలకు బీజేపీ సిద్ధమైంది. కాసేపట్లో బషీర్‌బాగ్‌ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించనున్నారు బీజేపీ కార్పొరేటర్లు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడి నుంచి జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి చేరుకోనున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపధ్యంలో బీజేపీ ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ ప్రభాకర్, బీజేపీ కార్పొరేటర్లకు విప్ జారీ చేశారు. మరోవైపు బీజేపీకి మొత్తం 47 మంది కార్పొరేటర్లు, ఇద్దరు ఎక్స్‌అఫీషియో సభ్యులు ఉన్నారు. 

Full View


Tags:    

Similar News