Sangareddy: ధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతల ధర్నా

* బీజేపీ నేతలను అడ్డుకున్న పోలీసులు * స్వల్ప తోపులాట.. పలువురు అరెస్ట్

Update: 2021-11-11 07:38 GMT

ధాన్యం కొనుగోలుపై బీజేపీ నేతల ధర్నా(ఫైల్ ఫోటో)

Sangareddy: సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ ఎదుట ఉద్రిక్తత చోటుచేసుకుంది. వర్షాకాలంలో పండించిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలన్నారు. అయితే బీజేపీ నేతల ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప తోపులాట జరిగింది. దీంతో పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

Tags:    

Similar News