బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ కుటుంబం ఒక్కటే బంగారమవుతోందని బీజేపీ నేత రవీంద్రనాయక్ ఆరోపించారు. సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధి కోసం సాధించుకున్న రాష్ట్రంలో దళిత గిరిజనుల ఆత్మగౌరవాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని మండిపడ్డారు. తెలంగాణకు పట్టిన గులాబీ చీడను వదిలించుకునేందుకు ప్రజలందరూ బీజేపీకి మద్దతు ఇవ్వాలని ప్రజలకు రవీంద్రనాయక్ పిలుపునిచ్చారు.